న్యూయార్క్: భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ టీఎన్ సుబ్రమణ్యం(76) మంగళవారం అమెరికాలోని మిషిగన్లో కన్నుమూశారు. అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ కోసం ప్రారంభించిన ‘రూట్ వన్ కంపెనీ’ సృష్టికర్త ఈయనే. 1979లో అమెరికాకు వెళ్లిన సుబ్రమణ్యానికి భారత్, అమెరికా దేశాల్లో గొప్ప విద్యావేత్తగా పేరున్నది.
ఆయన గణితశాస్ర్తానికి సంబంధించి పలు నమూనాలు, సిద్ధాంతాలను రూపొందించారు. కొన్నేండ్లు ఫిలడెల్ఫియా యూనివర్సిటీలో గణిత అధ్యాపకులుగా పనిచేశారు. ఆ తర్వాత ఓక్లాండ్కు వెళ్లి అధ్యాపక వృత్తిని కొనసాగించారు. అనంతరం ఆటోమోటిక్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కోసం రూట్ వన్ కంపెనీని ప్రారంభించారు.