హ్యూస్టన్, ఫిబ్రవరి 26: అశోక్ వీరరాఘవన్ అనే ఇండో-అమెరికన్ ఇంజినీర్కు టెక్సాస్ అత్యున్నత అకడమిక్ అవార్డు ‘ఎడిత్ అండ్ పీటర్ ఓడన్నెల్’ దక్కింది. ఇమేజింగ్ సాంకేతికతలో ఆయన చేసిన పరిశోధనలకు గా ను ఈ అవార్డును ఇచ్చారు. టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజినీరిం గ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డును బహుకరించనున్నది.
వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని టెక్సాస్ రా ష్ట్రంలో ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో వీరరాఘవన్ చేసిన కృషికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. చెన్నైకి చెందిన వీరరాఘవన్ ప్రస్తుతం రైస్ యూనివర్సిటీకి చెందిన జార్జ్ ఆర్ బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 2002లో ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు.