అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంపై సోమవారం డ్రోన్ దాడి జరిగింది. యెమెన్కు చెందిన హౌతి మూవ్మెంట్ ఈ దాడికి పాల్పడినట్టు వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులతో పాటు ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
అబుదాబిలో డ్రోన్ల ద్వారా రెండుసార్లు కాల్పులు జరిగాయని గల్ఫ్ అధికారులు ప్రకటించిన కొద్దిసేపటికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై తాము దాడులకు పాల్పడ్డామని ఈ సంస్థ పేర్కొంది.
అబుదాబి ఎయిర్పోర్ట్లో మూడు ఇంధన ట్యాంకర్లు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిసింది. కాగా 2019 సెప్టెంబర్ 14న సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు వ్యవస్థలపై యెమెన్ హౌతీ రెబెల్స్ ఇదే తరహా దాడులకు తెగబడ్డారు. పర్షియన్ గల్ఫ్లో ఉద్రిక్తతలు పెరిగిన నేపధ్యంలో ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.