అమెరికాపై పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి రబ్బానీ ఖార్ తీవ్రంగా మండిపడ్డారు. ఇమ్రాన్ తన కుర్చీని కాపాడుకోవడం కోసం అమెరికా పాక్ మధ్య ఉన్న సంబంధాలను చెడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నుంచి సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అసలు ఇమ్రాన్ను గుర్తుంచుకునే వారే ఉండరని ఎద్దేవా చేశారు. కేవలం తన కుర్చీ కోసమే ఇరు దేశాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆక్షేపించారు. డ్రోన్ దాడుల విధానంపై కేవలం ఇమ్రాన్ ప్రభుత్వం మాత్రమే కాకుండా దేశ విధానమే చాలా స్పష్టంగా ఉందన్నారు. తన ప్రత్యర్థులను దెబ్బతీయాలని ఇమ్రాన్ ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ.. అది బెడిసి కొట్టి, దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోందని, ఇమ్రాన్తో ఇదే పెద్ద సమస్య అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సదురు వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఉంటాయని ఆమె గుర్తు చేశారు. అయితే.. ఇమ్రాన్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా ఘోరంగా వుందని, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అంతర్గత విషయాలను కూడా లేఖ అంటూ ఇమ్రాన్ బహిరంగ పరుచుతున్నారని ఫైర్ అయ్యారు.