వాషింగ్టన్: భారతీయ అమెరికా సంతతికి చెందిన హరిణి లోగన్ ఈ ఏడాది స్క్రిప్స్ జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో చాంపియన్గా నిలిచింది. అమెరికాలోని వాషింగ్టన్లో ఈ పోటీలు జరిగాయి. 22 అక్షరాలు ఉన్న పదాన్ని ఫైనల్లో చెప్పిన హరిని 2022 విజేతగా నిలిచింది.
గురువారం రాత్రి ఈ కాంపిటీషన్ జరిగింది. 14 ఏళ్ల హరిణి శాన్ ఆంటోనియోలో 8వ గ్రేడ్ చదువుతోంది. స్పెల్-ఆఫ్ ఫైనల్లో ఆమె డెన్వర్కు చెందిన 12 ఏళ్ల విక్రమ్ రాజును ఓడించింది. కేవలం 90 సెకన్ల స్పీడ్తో స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ను హరిణి
ఎగురేసుకుపోయింది. ఆ సమయంలో ఆమె 21 పదాలను తప్పులేకుండా చెప్పింది. అదే సమయంలో విక్రమ్ 15 పదాలను తప్పులేకుండా తెలిపాడు.
స్పెల్లింగ్ బీ కాంపిటీషన్లో పాల్గొనడం ఇది నాలుగవ సారి అని, ట్రోఫీని గెలవడం సంతోషంగా ఉందని హరిని పేర్కొన్నది. నిజానికి మొదట్లో కొంత ఆందోళన ఉందని, కానీ ఆ తర్వాత తన వేగాన్ని పెంచినట్లు ఆమె తెలిపింది. ఎక్కువగా శ్వాస తీసుకోకుండా చాలా వేగంగా హరిణి పదాలను చదువుతూ తన ట్యాలెంట్ను చూపించింది.