Hafiz Saeed | ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తుది ఫలితాలు వెలువడేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు తల్హ సయీద్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. లాహోర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అయితే పాకిస్తాన్ మాజీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో తల్హ సయీద్ ఓటమి పాలయ్యారు.
తల్హ సయీద్ను ఉగ్రవాదిగా గతేడాది భారత్ గుర్తించింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో తల్హ సయీద్ క్లరికల్ వింగ్ హెడ్గా కొనసాగుతున్నాడు. అయితే ఉగ్రవాది తల్హ సయీద్ పాక్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడాన్ని భారత్ ఖండించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే జాతీయ భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.