లండన్, అక్టోబర్ 13: ఫోన్ చార్జింగ్ అయిపోనప్పుడు జేబులో పెట్టుకోగానే చార్జ్ అయితే బాగుండు అన్న చిలిపి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి ఆలోచనే కొందరు శాస్త్రవేత్తలకు వచ్చినట్టుంది. అందుకే సౌర శక్తితో విద్యుత్తును తయారుచేసే వస్ర్తాన్ని తయారు చేశారు. ఆ వస్త్రంతో అంగీ, ప్యాంటు కుట్టించుకొంటే సరి. ఎంచక్కా.. ఫోన్లు, స్మార్ట్వాచ్లను జేబులో ఫోన్ పెట్టేసి చార్జింగ్ చేసుకోవచ్చు. ఇంగ్లండ్లోని నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అద్భుత ఆవిష్కరణ చేశారు.
నూలు పోగుల మధ్య 1,200 సూక్ష్మ సోలార్ ప్యానెల్స్ను అమర్చి, వస్ర్తాన్ని అల్లారు. ఆ వస్ర్తాన్ని ఎండలో ఉంచి సౌర శక్తిని గ్రహించేలా చేశారు. దాంతో అవి 400 మిల్లీవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాయి. ఈ విద్యుత్తు సెల్ఫోన్ చార్జింగ్కు సరిపోతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వస్ర్తాన్ని 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఉతకొచ్చని వివరించారు. దీన్ని మరింత అభివృద్ధి చేసి జాకెట్లు, ఇతర వస్ర్తాలను తయారుచేస్తామని పేర్కొన్నారు.
వస్ర్తాన్ని ఎలా తయారు చేశారంటే..