లండన్, నవంబర్ 2: రోజులో అతి తక్కువ సమయం నిద్రపోయినా.. ఎక్కువసేపు కునుకుతీసినా అది కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అతినిద్ర, నిద్రలేమి అనేవి కంటిచూపును కోల్పోయేందుకు కారణమవుతున్న ‘గ్లకోమా’కు దారితీస్తున్నట్టు లండన్ పరిశోధకులు గుర్తించారు. 4లక్షల మందిపై దశాబ్దంపాటు అధ్యయనం నిర్వహించి ఈ విషయాన్ని తేల్చారు.
పగటి నిద్ర, రాత్రిపూట నిద్రలేమితో కూడా గ్లకోమా ముప్పు పొంచి ఉందని తేల్చారు. గ్లకోమాతో ప్రపంచవ్యాప్తంగా 112 మిలియన్ల మంది బాధపడుతున్నారు. కాగా, ధీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నవారు తప్పనిసరిగా కంటిపరీక్షలు చేయించుకోవాలని పరిశోధకులు సూచించారు.