ఫ్రీటౌన్, నవంబర్ 6: పశ్చిమ ఆఫ్రికాలోని సియెరా లియోన్లో ఒక ఆయిల్ ట్యాంకర్ పేలి 98 మంది పౌరులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రాజధాని ఫ్రీటౌన్కు సమీపంలోని వెల్లింగ్టన్లో ట్యాంకర్ను బస్సు ఢీకొనగా… లీక్ అవుతున్న ఆయిల్ను పట్టుకొనేందుకు పెద్దసంఖ్యలో స్థానికులు గుమిగూడినప్పుడు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మంటల్లో కాలిపోయిన వ్యక్తుల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా చెల్లాచెదురుగా పడడటంతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. గాయపడినవారిలో మరో 30 మంది చావుబతుకుల్లో ఉన్నారు.