కోపెన్హెగన్: యూరోప్లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. సెంట్రల్ స్వీడెన్లో ఓ రైల్వే క్రాసింగ్(Railway Crossing) వద్ద ఈ ఘటన జరిగింది. బాధితుల్లో 25 ఏళ్ల వ్యక్తితో పాటు 20 ఏళ్ల మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. రైలు దిగి క్రాసింగ్ వద్ద ట్రాక్ దాటుతున్న సమయంలో.. మరో ట్రాక్పై వస్తున్న రవాణా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం పట్ల విచారణ చేపడుతున్నామని అధికారులు చెప్పారు. రైలు క్రాసింగ్ వద్ద ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చేందుకు కేవలం లైట్లు మాత్రమే ఉంటాయి. ఓరెబ్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఇదే క్రాసింగ్ వద్ద ఆరేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.