ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధాని ఇమ్రాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ విషయంలో ప్రధాని ఇమ్రాన్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, వాటిని వెంటనే నెరవేర్చాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రంగ్ ఫూల్ ఖానేవాల్ ముల్తాన్ రోడ్డులో దాదాపు 3 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చడంలో ప్రధాని ఇమ్రాన్ ఘోరంగా విఫలమయ్యారని రైతు నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఎరువులను అందుబాటులో ఉంచాలని, అలాగే తమకిచ్చే విద్యుత్ ధరలను తగ్గించాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారని డాన్ పత్రిక పేర్కొంది. ప్రస్తుతం జిల్లాల్లోనే నిరసనలు చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే ఇస్లామాబాద్ వేదికగా కూడా నిరసనలు చేస్తామని రైతులు హెచ్చరించారు.