బీజింగ్ : చాట్జీపీటీ వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉంటాయని తాజాగా ఓ ఘటన నిరూపించింది. దక్షిణ చైనాలోని గుయాంగ్ డాంగ్ ప్రావిన్స్కు చెందిన సదరు వ్యక్తి.. చైనాలో ఏప్రిల్ 25న లోకల్ ట్రైన్ ప్రమాదానికి గురైనదని, ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారని తప్పుడు వార్తను అల్లాడు.
దీనిని చైనా సెర్చ్ ఇంజిన్ ‘బైడు’లో 20 అకౌంట్ల నుంచి పోస్ట్ చేశాడు. ఈ తప్పుడు వార్తను 15 వేల మందికి పైగా చదివారు. ఈ ఫేక్ న్యూస్ను గుర్తించిన ఆ దేశ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. చాట్జీపీటీని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై చైనాలో ఇది తొలి అరెస్టు.