లండన్, అక్టోబర్ 21: సంపన్నులకు పన్ను రాయితీలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణం కావడంతో బ్రిటన్ ప్రధాని లిజ్ట్రస్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేవలం 45 రోజులు మాత్రమే ప్రధానిగా పనిచేసినా ఆమెకు జీవితాంతం ఏడాదికి రూ. కోటి భత్యం (1,15,000 పౌండ్లు) అందనుంది.
అది కూడా పన్నుచెల్లింపుదారుల నుంచే అందడం గమనార్హం. యూకే ప్రధానమంత్రిగా అతి తక్కువకాలం పనిచేసినప్పటికీ ఆమె పబ్లిక్ డ్యూటీ కాస్ట్ అలవెన్స్ (పీడీసీఏ)కి అర్హులు. ప్రజాజీవితంలో చురుగ్గా ఉండే మాజీ ప్రధానులకు సహాయం చేసేందుకుగానూ ఈ భత్యాన్ని 1991 నుంచి ఇస్తున్నారు. క్యాబినెట్ ఆఫీస్ ఓట్నుంచి ఈ భత్యాన్ని చెల్లిస్తారు. దీన్ని క్యాబినెట్ ఆఫీస్ ఫైనాస్స్ టీం పర్యవేక్షిస్తుంది.