ఇస్లామాబాద్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఆదివారం ఓటింగ్ లేకుండానే తిరస్కరించారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పాక్ పార్లమెంట్ను రద్దు కోసం రాష్ట్రపతికి సిఫారసు చేసినట్లు ప్రకటించారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు దేశం సిద్ధం కావాలన్నారు. ఇదిలా ఉండగా.. అవిశ్వాస తీర్మానంపై డిప్యూటీ స్పీకర్ నిర్ణయం, ఇమ్రాన్ పార్లమెంట్ రద్దు కోసం చేసిన సిఫారసుపై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రతిపక్షం ప్రకటించింది.
ఈ సందర్భంగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ఇక అవిశ్వాస తీర్మానంపై ఎప్పుడు ఉంటుందో సుప్రీం కోర్టు నిర్ణయించాల్సి ఉందన్నారు. నిర్ణయం మార్చే వరకు జాతీయ అసెంబ్లీ ఎదుట తాము ధర్నా చేస్తామన్నారు. మాకు పూర్తి మెజారిటీ ఉందని, అవిశ్వాస తీర్మానంలో ప్రధానిని ఓడిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగపరమైన హక్కులు కల్పించేదాకా ప్రతిపక్ష ఎంపీలు జాతీయ అసెంబ్లీలోనే కూర్చుంటారని, డిప్యూటీ స్పీకర్ నిర్ణయం చిన్నపిల్లల ఎత్తుగడని విమర్శించారు.