ఇస్లామాబాద్, ఆగస్టు 29: రికార్డు స్థాయి వర్షాలతో పాకిస్థాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పాక్లోని దాదాపు సగం భూభాగం వరకు వరదను ఎదుర్కొంటున్నదంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.
వరదల కారణంగా జరిగిన పలు ఘటనల్లో ఇప్పటి వరకు 1,061 మంది మరణించారు. మరోవైపు సోమవారం వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఓ బోటు సింధు నదిలో బోల్తోపడింది. సింధ్ ప్రావిన్స్లో జరిగిన ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. 20 మంది గల్లంతయ్యారు.