క్విటో (ఈక్వెడార్): ఈక్వెడార్ రాజధాని క్విటోలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు ఇండ్లపై విరిగిపడ్డాయి. దీంతో 18 మంది మృత్యువాత పడ్డారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని, వారి కోసం అధికారులు, స్థానికులు వెతుకుతున్నారు. తొలుత 14 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. అయితే మరో నాలుగు మృతదేహాలు లభించడంతో మృతుల సంఖ్య 18కి చేరింది. కొండ చరియలు విరిగిపడటంతో మూడు మీటర్ల ఎత్తు వరకు బురద పేరుకుపోయింది.