కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో గురువారం రెండు ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలుసు కదా. ఈ దాడుల్లో వంద మందికిపైగా మరణించారు. దాని తాలూకు రక్తపు మరకలు ఇంకా చెదిరిపోనే లేదు.. దేశం విడిచి వెళ్లడానికి మరోసారి ఆఫ్ఘన్లు ఎయిర్పోర్ట్కు పోటెత్తారు. ఈ బాంబుల భయం కంటే అక్కడి వారికి తాలిబన్ల భయం ఎంతలా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లోకి ఎలాగైనా వెళ్లి.. దేశం నుంచి బయటపడితే చాలు అన్న ఆతృత అక్కడి వారిలో కనిపిస్తోంది. శుక్రవారం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న పరిస్థితి వీడియోను అబ్దుల్హక్ ఒమెరి అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.
ఎయిర్పోర్ట్ ముందు ఉన్న మురికి కాలువలో మోకాలి లోతు నీటిలో వాళ్లు నిరీక్షిస్తుండటం ఈ వీడియోలో చూడవచ్చు. గురువారం పేలుళ్ల నేపథ్యంలో శుక్రవారం ఆఫ్ఘన్ నుంచి తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఈ నెల 31లోపు విదేశీ బలగాలు దేశం విడిచి పెట్టనున్న నేపథ్యంలో ఆ లోపు మరోసారి ఇలాంటి దాడుల ప్రయత్నాలు జరిగే ప్రమాదం ఉన్నట్లు అమెరికా చెబుతోంది.