టోక్యో, డిసెంబర్ 18: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ గురించిన ఓ భయంకర వాస్తవం తాజా అధ్యయనాల్లో వెలుగులోకి వచ్చింది. కొవిడ్తో కన్నుమూసినవారి మృతదేహం నుంచి పోస్టుమార్టం నిర్వహించిన 17 రోజుల వరకూ జాంబి వైరస్లా కరోనా మహమ్మారి ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉన్నదని జపాన్ పరిశోధకులు గుర్తించారు. మృతదేహం ముక్కు, ఊపిరితిత్తుల్లో ఉన్న కొవిడ్.. పోస్టుమార్టానికి ఉపయోగించిన వాయువుల ద్వారా బతికి ఉన్నవారికి వ్యాపిస్తున్నట్టు తేల్చారు. ఎలుకలపై పరిశోధన నిర్వహించి దీన్ని గుర్తించారు. దీనివల్ల సామాన్య జనానికి పెద్దగా ప్రమాదం లేకున్నా, పోస్టుమార్టం నిర్వహించే సిబ్బందికి కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్నదని తేల్చారు. అలాగే, మృతదేహంపై పడి రోదించే కుటుంబ సభ్యులు, బంధువులకూ ఈ ముప్పు ఉన్నట్టు కనుగొన్నారు. కరోనాతో మృతిచెందినవారి చెవులు, ముక్కు, పురీషనాళాన్ని కాటన్ప్యాడ్స్తో కవర్ చేస్తే ఈ ముప్పునుంచి బయటపడొచ్చని పరిశోధకులు సూచించారు.