లండన్, డిసెంబర్ 1: కంటి ఇన్ఫెక్షన్లను త్వరగా గుర్తించే స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ను భారత్, యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. భారత్లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్ శాస్త్రవేత్తలు కలిసి దీన్ని తయారుచేశారు.
ఈ కాంటాక్ట్ లెన్స్ను వాడి ఇంట్లోనే కంటి ఇన్ఫెక్షన్లను గుర్తించవచ్చని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తెలిపింది.