Bolivia : బొలీవియాలో కొత్త ఏడాదికి ముందు రోజు హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక గవర్నర్, లూయిస్ ఫెర్నాండో కమచో అరెస్టును నిరసిస్తూ ఆయన మద్ధతుదారులు శాంటా క్రూజ్ సిటీలో ఆందోళనకు దిగారు. దాంతో వాళ్లను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు పేలుడు పదార్థాలను విసిరారు. దాంతో వాళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నఫెర్నాండోకు స్థానిక కోర్టు జడ్జి సెర్గియో పచెకో నాలుగు నెలల ప్రి-ట్రయల్ శిక్ష విధించారు. అతడిని రాజధాని లాపేజ్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైలుకు తరలించాల్సిందిగా పోలుసులను ఆదేశించారు. దాంతో, ఫెర్నాండోను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. లాపేజ్ పోలీస్ స్టేషన్ నుంచి వర్చువల్గా కోర్టు విచారణకు హాజరైన ఆయన ‘బొలీవియాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం తాను ఈ పోరాటాన్ని విరమించను’ అని తెలిపాడు. అరెస్టును వ్యతిరేకిస్తూ వందలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. పోలీసు స్టేషన్పై రాళ్లు రువ్వారు. పాత టైర్లను కాల్చడమే కాకుండా పోలీసులపైకి పేలుడు పదార్థాలు విసిరారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు.
2019 ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయ అశాంతి నెలకొనడంలో ఫెర్నాండో పాత్ర కీలకమని న్యాయవాదులు వాదించారు. ఆ సమంలో చెలరేగిన అల్లర్లలో దాదాపు 37మంది చనిపోయారు. దాంతో వామపక్ష పార్టీకి చెందిన అధ్యక్షుడు ఎవో మెరలెస్ను బలవంతంగా గద్దె దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాన పక్షానికి చెందిన జియనైన్ అనెజ్ మధ్యంతర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు.