సిడ్నీ: కరోనా ఆంక్షలు ఉల్లంఘించి ప్రార్థనలు నిర్వహించిన ఓ చర్చి ( Church ) కి భారీ జరిమానా విధించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఈ ఘటన జరిగింది. చర్చిలో సుమారు 60 మంది ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్ట్ ఎంబసీకి చెందిన చర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. క్రైస్ట్ ఎంబసీ సిడ్నీ చర్చిపై దాడి చేశారు. ప్రార్థనలు నిర్వహించిన సంస్థకు 2.67 లక్షలు జరిమానా విధించింది. ఇక 30 మంది క్రైస్తవ పూజారులకు ఒక్కొక్కరికి 75 వేల జరిమానా విధించింది. వెస్ట్రన్ సిడ్నీలో జరిగిన చర్చి కార్యక్రమాన్ని ఫేస్బుక్లో లైవ్ చేశారు. నిజానికి సిడ్నీలో స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాలు అమలులో ఉన్నాయి. డెల్టా వేరియంట్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆ ఆంక్షలు అమలు చేస్తున్నారు.