China | ఓ టీచర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆరేళ్ల బాలుడికి అతని పుట్టిన రోజున బలవంతంగా వాంతిని తినిపించారు. ఈ ఘటన చైనాలోని లయోనింగ్ ప్రావిన్స్లో గత నెలలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. లయోనింగ్ ప్రావిన్స్లోని మలువాన్ కిండర్గార్డెన్ స్కూల్లో ఆరేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నాడు. అయితే సెప్టెంబర్ 15వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా స్కూల్కు కొత్త బట్టలతో వెళ్లాడు. మధ్యాహ్నం లంచ్ ముగిశాక, బలవంతంగా అతనికి టీచర్ గుమ్మడికాయ ముక్కలను తినిపించారు. దాంతో ఆ బాలుడు వాంతింగ్ చేసుకున్నాడు. ఆ వాంతిని తిరిగి తినాలని టీచర్ ఆదేశించారు. వాంతింగ్ చేసుకోవడంతో బాలుడి డ్రెస్ కూడా పాడైపోయింది.
ఇంటికి చేరుకున్న బాలుడు తనకు జరిగిన అవమానంపై నానమ్మకు చెప్పాడు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లారు. నర్సరీ టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, బాలుడికి బలవంతంగా తినిపించడంతోనే వాంతింగ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. ఇక బాధిత బాలుడి పేరెంట్స్కు క్షమాపణలు చెప్పాలని పోలీసులు స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.