కాట్మాండు: నేపాల్లో వరద(Nepal Floods)ల్లో చిక్కుకున్న మరో ఇద్దర్ని ఇవాళ రక్షించారు. త్రిశూలీ టన్నెల్ నుంచి ఓ చైనీస్ దేశస్థుడిని కాపాడారు. వరదలు సంభవించిన పది రోజుల తర్వాత ఆ చైనా దేశస్థుడు టన్నెల్లో సజీవంగా ఉన్నాడు. చికత్స కోసం అతన్ని కాట్మాండుకు తరలించినట్లు నేపాలీ ఆర్మీ ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న జలవిద్యుత్తు టన్నెల్లో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు భారీ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుమారు 900 మంది కార్మికులు వివిధ టన్నెల్స్లో ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఆగస్టు 26వ తేదీన సంభవించిన నేపాల్ జల విలయంలో సుమారు 1300 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 5 వేల మంది మిస్సింగ్ అయ్యారు.భారత, నేపాలీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి. శుక్రవారం 9వ రోజు ఇద్దరు నేపాలీ దేశస్థులను త్రిశూలీ టన్నెల్ నుంచి సజీవంగా రక్షించిన విషయం తెలిసిందే.
VIDEO | Nepal: A Chinese national rescued from the tunnel of flood-affected Upper Trishuli 1 Hydropower Project.
(Source: Nepal Army)
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/1frBql8iiO
— Press Trust of India (@PTI_News) September 5, 2026
నువాకోట్ పట్టణంలో పూర్తిగా దెబ్బతిన్న ఓ ఇంటి నుంచి ఓ మహిళను కూడా నేపాల్ ఆర్మీ రక్షించింది. 64 ఏళ్ల చండికా శ్రేష్ట అనే మహిళ ఆ ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. బేత్రావతిలో ఇంటి శిథిలాల కింద నుంచి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఆ మహిళ మొత్తం బురదతో నిండిపోయింది.
BREAKING: Ten days after the devastating Bhote Koshi flash flood, a woman has been rescued alive from beneath flood debris in Betrawati, Nuwakot.
Video courtesy: Armed Police Force, Nepal. pic.twitter.com/6hBzcTtxsC
— Everest Today (@EverestToday) September 5, 2026