Afghanisthan : అఫ్గానిస్థాన్లోని తాలిబాన్ ప్రభుత్వం చైనా కంపెనీతో తొలి అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకుంది. అము దర్యా బేసిన్ నుంచి ముడి చమురును వెలికి తీసేందుకు గ్జింజియాంగ్ సెంట్రల్ ఆసియా పెట్రోలియం అండ్ గ్యాస్ కో (సీఏపీఈఐసీ) అనే కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకుంది. గనులు, పెట్రోలియం శాఖ మంత్రి షేక్ షహబుద్దీన్ దిలావర్, సీఏపీఈఐసీ అధికారి కాబూల్లో ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేశారు. అఫ్గానిస్థాన్లో చైనా రాయబారి వాంగ్ యూ, ఆ దేశ ఉపప్రధాని ముల్లాహ్ అబ్దుల్ ఘనీ బరాదర్ సమక్షంలో వీళ్లిద్దరూ అగ్రిమెంట్ పేపర్లు మర్చుకున్నారు. 25 ఏళ్లకు ఈ ఒప్పందం కుదిరింది. దీంతో తాలిబాన్ ప్రభుత్వానికి కాంట్రాక్ట్ పూర్తయ్యేంత వరకు 15 శాతం రాయల్టీ లభించనుంది. ఈ కాంట్రాక్ట్తో అఫ్గానిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడతుందని, సొంతంగా ముడిచమురు చేసుకోగలమని బరాదర్ తెలిపారు.
ఒప్పందంలో భాగంగా సీఏపీఈఐసీ కంపెనీ తొలి ఏడాది 150 మిలియన్ డాలర్లు (రూ.12 వేల కోట్లకు పైగా), ఆ తర్వాత మూడేళ్ల పాటు 540 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఐదు చమురు బావులు, సహజవాయువు బ్లాక్స్లో ఉత్పత్తి ప్రారంభించనుంది. ఈ ఐదు బావుల్లో దాదాపు 8.7 కోట్ల బ్యారెల్ ముడి చమురు ఉన్నట్టు గతంలో సర్వేలు వెల్లడించాయి. దీంతో రోజూ ముడి చమురు ఉత్పత్తి 200 టన్నులు కానుంది. ఆ తర్వాత 1,000 టన్నులకు పెరగనుంది.