లండన్, నవంబర్ 1: భారత సంతతికి చెందిన రచయిత్రి నందిని దాస్ ప్రతిష్టాత్మక బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్కు ఎంపికయ్యారు. 2023 ఏడాదికి గానూ ఆమెను ఈ అవార్డుకు ఎంపికచేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న నందిని దాస్ ప్రపంచ సాంస్కృతిక అవగాహనను పెంచేలా రచించిన ‘కౌంటింగ్ ఇండియా: ఇంగ్లండ్, మొఘల్ ఇండియా అండ్ ఆరిజన్స్ ఆఫ్ అంపైర్’ కు ఈ ప్రైజ్ లభించింది. మంగళవారం లండన్లోని బ్రిటిష్ అకాడమీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమెకు ఈ బహుమతిని అందజేశారు.