బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టి చరిత్ర సృష్టించారు భారత సంతతికి చెందిన రిషి సునాక్. ప్రధాని పీఠం అధిరోహించన వెంటనే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు చర్యలు మొదలుపెట్టారాయన. పార్టీ మీటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉండే ఆయన లండన్లోని వెస్ట్మినిస్టర్ ట్యూబ్ స్టేషన్లో గురువారం ఉదయం పాపీస్ (ఎర్రని పూలు, నల్లని గింజలు ఉన్న వాటిని) అమ్ముతూ సందడి చేశారు. ఆ దారిన వెళ్తున్నవాళ్లు చేతిలో పాపీస్ ట్రే పట్టుకొని ఉన్న ప్రధానిని చూసి ఆశ్చర్యపోయారు. కాగితంతో తయారుచేసిన ఒక్కో పాపీస్ని 5 యూరోలకు అమ్మారు రిషి. రాయల్ బ్రటీష్ లీజియన్ ప్రతి ఏడాది నిర్వహించే లండన్ పాపీ డే అప్పీల్ క్యాంపెయిన్ నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది ఆ క్యాంపెయిన్లో భాగంగా విరాళాలు సేకరించడం కోసం కాగితం పూలని అమ్మారు రిషి. డోనేషన్స్ సేకరించేందుకు ఇంటింటికీ తిరుగుతున్న బ్రిటీష్ ఆర్మీ, నావీ, ఎయిర్ఫోర్స్ వాలంటీర్లతో కలిసి ఈ క్యాంపెయిన్లో పాల్గొన్నారు రిషి సునాక్. అంతేకాదు ఆయన తనతో సెల్ఫీలు దిగినవాళ్లతో కాసేపు మాట్లాడారు కూడా.
లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్ తర్వాత బ్రిటన్ ప్రధాని పీఠం రిషికే దక్కుతుందని అనుకున్నారంతా. అయితే, అనూహ్యంగా లిజ్ట్రస్ ప్రధాని అయ్యారు. అయితే, ఆర్థిక సంస్కరణల నిర్ణయంపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దాంతో, బ్రిటన్ కొత్త ప్రధానికి రిషి ఎన్నికయ్యారు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండడమే కాకుండా ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న టైంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారాయన.గతంలో బోరిస్ జాన్సన్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది రిషికి. అధికార బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టేందుకు చర్యలు మొదలుపెట్టారాయన.
Rishi out selling poppies in Westminster Tube Station this morning pic.twitter.com/wyUEKFfkYZ
— Calgie (@christiancalgie) November 3, 2022