బ్రసిలియా : బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది శిక్షణ నిమిత్తం గుహలో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు పైకప్పు కూలిన సంఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలవగా.. ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. 26 మంది అగ్నిమాపక సిబ్బంది బృందంలో అల్టినోపోలిస్ నగరానికి సమీపంలో ఉన్న కేవ్లో ఆదివారంలో శిక్షణలో ఉండగా ప్రమాదం జరిగిందని సావ్ పాలో అగ్నిమాపక విభాగం ట్వీట్ చేసింది.
ఘటనలో తొమ్మిది మంది చనిపోయారని పేర్కొంది. పోలీసులు, అత్యవసర ఆరోగ్య బృందాలు అక్కడికి చేరుకొని అక్కడ చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నం చేశారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయి. కేవ్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సావ్పాలో గవర్నర్ జోవో డోరియా పేర్కొన్నారు. అల్టినోపోలిస్ గుహలు పర్యాటకానికి ప్రసిద్ధి చెందాయి.