ప్రధాని ఇమ్రాన్ను ఎలాగైనా గద్దె దింపాలని పాక్లోని ప్రతిపక్షాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే సొంత పక్షం నుంచే ఇమ్రాన్కు సెగ తగిలింది. కొద్ది రోజుల క్రిందటే ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో అల్టిమేంటం జారీ చేశారు. ఈ నెల 21 న పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే… సభ నుంచి బయటకు వెళ్లే ప్రసక్త లేదని తేల్చి చెప్పారు. అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశాలను కూడా అడ్డుకుంటామని సంచలన ప్రకటన చేశారు. స్పీకర్ గనక ఈ నెల 21 న అవిశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే విపక్ష నేతలందరమూ రోడ్లెక్కుతామని, నిరసనలను వ్యక్తం చేస్తామని బిలావల్ భుట్టో హెచ్చరించారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సర్కార్ పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. పలువురు ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవడంలో ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇప్పటికే ఇమ్రాన్ సర్కార్కు వ్యతిరేకంగా విపక్షాలు గతవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. రోజురోజుకు ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులను కోల్పోతున్నారు. గురువారం ముగ్గురు మంత్రులు, 24 మంది ఎంపీలు రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ నిర్వహణలోనూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలోనూ, విదేశాంగ విధానంలోనూ ఇమ్రాన్ఖాన్ విఫలం అయ్యారని విపక్షం ఆరోపిస్తున్నది.