రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మధ్య చర్చలు జరగబోతున్నాయి. శుక్రవారం ఈ చర్చలు జరుగుతాయని వైట్హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాల మధ్య పోటీతత్వంతో పాటు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంశం కూడా వీరిద్దరి మధ్య చర్చకు వస్తుందని వైట్హౌజ్ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని చైనా సమర్థించడం, నాటో విస్తరణను జిన్పింగ్ వ్యతిరేకించడం.. లాంటి పరిస్థితుల్లో బైడెన్, జిన్పింగ్ మధ్య జరుగుతున్న చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.
వారం రోజుల క్రిందటే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాకే సులివన్, చైనా కమ్యూనిస్టు పార్టీ ముఖ్య రాయబారి యాంగ్ జైచీ ఇద్దరూ భేటీ అయ్యారు. రోమ్లోని ఓ హోటల్లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ భేటీ అత్యంత ముఖ్యమైనదని ఇరు దేశాలూ ప్రకటించుకున్నాయి.