Hijack | హిందూ మహాసముద్రంలో (Indian Ocean) సముద్రపు దొంగలు (Pirates) మరోసారి రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ జెండాతో వస్తున్న ఓ కార్గో నౌకను హైజాక్ చేశారు (Bangladeshi ship hijacked). ఈ విషయాన్ని నౌక యాజమాన్యం ధృవీకరించింది.
బంగ్లాదేశ్లోని కబీర్ స్టీల్ అండ్ రీరోలింగ్ మిల్ గ్రూప్కు చెందిన అబ్దుల్లా ఎమ్వీ అనే కార్గో నౌక మొజాబిక్ దేశం నుంచి బొగ్గు తీసుకొని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు బయల్దేరింది. ఈ నౌక హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా సోమాలియా (Somalia) సమీపంలోకి రాగానే నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేసినట్లు నౌక యాజమాన్యం తెలిపింది.
నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నట్లు చెప్పింది. వారంతా బంగ్లాదేశీయులే అని వెల్లడించింది. నౌక హైజాక్ అయినట్లు సిబ్బంది మంగళవారం 1:30 గంటల సమయంలో తమకు సమాచారం అందించారని తెలిపింది. సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని.. ప్రస్తుతం వారంతా సేఫ్గా ఉన్నట్లు తమకు సమాచారం అందించారని యాజమాన్యం తెలిపింది.
Also Read..
Water Crisis | నెలకు ఐదు సార్లే స్నానం.. వంట వండుకోకుండా ఫుడ్ ఆర్డర్.. బెంగళూరు ప్రజల నీటి కష్టాలు
Japan Private Satellite | లాంచ్ చేసిన క్షణాల్లోనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్.. VIDEO