లండన్, డిసెంబర్ 29: నవజాత శిశువులకు బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ప్రస్తుతం వాడుతున్న యాంటి బయాటిక్స్కు వారి శరీరంలో బ్యాక్టీరియా, వైరస్లు మొండిగా తయారై ఏటా 23 లక్షల మంది చిన్నారులు మృత్యువాతపడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో నవజాత శిశువుల కోసం కొత్త యాంటిబయాటిక్స్ను తయారుచేయడం అత్యావశ్యకమని ప్రపంచ ప్రజారోగ్య నిపుణులు పేర్కొన్నారు. గత దశాబ్దం నుంచి మొదటి, రెండో లైన్ యాంటిబయాటిక్స్కు యాంటిమైక్రోబియల్ నిరోధకత 50-70 శాతం పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. చిన్నారులకు ఏది ఉత్తమంగా, సురక్షితంగా పనిచేస్తుందో తెలుసుకొనేందుకు అధిక ప్రాధాన్యం కలిగిన యాంటిబయాటిక్స్ను గుర్తించాల్సిన అవసరం ఉన్నదని లండన్కు చెందిన జార్జ్స్ వర్సిటీ నిపుణుడు మైక్ శార్లాండ్ సూచించారు.