న్యూయార్క్, ఆగస్టు 12: భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై అమెరికాలో దాడి జరిగింది. న్యూయార్క్లోని చౌటౌక్వా ఇన్స్టిట్యూట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేజ్పైకి దూసుకొచ్చి 10-15 సార్లు కత్తితో పొడిచినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తీవ్ర గాయాలపాలైన రష్దీను హెలికాప్టర్లో దవాఖానకు తరలించారు. నిందితుడ్ని సిబ్బంది పోలీసులకు అప్పగించారు. దాడికి కారణంపై స్పష్టత రాలేదు. సల్మాన్ రష్దీ రాసిన ‘ది సాటానిక్ వెర్సెస్’ అనే పుస్తకాన్ని ఇరాన్లో 1988 నుంచి నిషేధించారు. రష్దీని చంపేస్తామం టూ బెదిరింపులు వచ్చాయి. రష్దీని చంపిన వారికి 30 లక్షలకు పైగా డాలర్లు రికార్డుగా ఇస్తామని ప్రకటనలు కూడా చేశారు. ఈ పుస్తకం ఇస్లాంను దూషించే విధంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి.