పోర్ట్ ఓ ప్రిన్స్ : హైతీలోని క్యాప్ హైటియన్ నగరంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో కనీసం 50 మంది సజీవ దహనమయ్యారు. ‘సంఘటనా స్థలంలో 50 నుంచి 54 మంది సజీవంగా దహనమవడం చూశాను’ అని నగర డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనోర్ పేర్కొన్నారు.
మృతులను గుర్తించడం అసాధ్యమన్న ఆయన.. పేలుడు కారణంగా సంఘటనా స్థలంలో సుమారు ఇండ్లు కాలిపోయాయన్నారు. ఇంట్లో ఉన్న వ్యక్తుల వివరాలు ఇంకా తెలియలేదని, ఇప్పుడు ఏం చెప్పలేమన్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇటీవల ముఠాలు గ్యాస్లైన్లను స్వాధీనం చేసుకోవడంతో హైతీలో తీవ్ర ఇంధన కొరత ఏర్పడుతున్నది.