బీజింగ్, ఆగస్టు 9: కరోనా వైరస్కు పుట్టినిల్లయిన చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. 35 మందికి లంగ్యా హెనిపావైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. షాన్డాంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా అన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు ఈ వైరస్ లక్షణాలు.