కీవ్ : ఉక్రెయిన్పై దాడి అనంతరం రష్యా సైనికులు చెర్నోబిల్ అను విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం సైతం ధ్రువీకరించింది. ప్రస్తుతం రేడియేషన్ స్థాయి 20 రెట్లు పెరిగిందని ఉక్రెయిన్ న్యూక్లియర్ ఏజెన్సీ తెలిపింది. అయితే, 1986లో జరిగినటువంటి దుర్ఘటన మరోసారి జరిగే ప్రమాదం తక్కువేనని పేర్కొంది. 4వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ న్యూక్లియర్ ప్లాంట్ ప్రాంతంలో వాహనాల కదలికలతో అకస్మాత్తుగా రేడియేషన్ పెరిగింది. చెర్నోబిల్ అణురియాక్టర్ దెబ్బతినగా.. రేడియేషన్ పెరిగింది. ఇక్కడ రేడియేషన్ స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తూ వస్తుంటారు.
ప్రతి గంట గంటకు రేడియేషన్ మొత్తాన్ని కొలుస్తారు. రియాక్టర్ సాధారణ పరిస్థితుల్లో గంటకు మూడు మైక్రోసీవర్ట్ల రేడియేషన్ను తట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, గురువారం ఆ వాల్యూమ్ గంటకు 65 మైక్రోసీవర్ట్లకు పెరిగింది, ఇది ట్రాన్స్-అట్లాంటిక్ విమానంలో సంభవించే మొత్తం కంటే ఐదు రెట్లు ఎక్కువ. చెర్నోబిల్ జోన్, చుట్టుపక్కల వాహనాలు, జన సంచారం పెరగడంతో కదలికలు పెరగడంతో రేడియోధార్మిక ధూళి ఏర్పడిందని షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ మెటీరియల్స్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ క్లైర్ కార్ఖిల్ తెలిపారు. రాబోయే రోజుల్లో కదలికలు తగ్గాలని, దీంతో రేడియేషన్ స్థాయిపడిపోతుందన్నారు. అయితే, ఈ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు.