Earthquakes | పాకిస్థాన్లో(Pakista) వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్లో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిన కొద్ది గంటలకే శనివారం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యురోపియన్ మెడిటేరియన్ సిస్మలాజికల్ సెంటర్ వెల్లడించింది. వరుస ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అధి కారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, వెనెజువెలాలో మరోసారి భూమి కంపించిది. రిక్టర్ స్కేల్పై 4.9 నమోదయింది. జంట భూకంపాలతో అతలాకుతలమైన వెనెజువెలాను ఆదుకునేందుకు ‘ఆపరేషన్ ఆమిస్టాడ్’ పేరుతో భారత్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నదని విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు.
దీనిలో భాగంగా సహాయక చర్యలకు అవసరమైన సామగ్రితో భారత్ సైన్యానికి చెందిన రెండు సీ17 విమానాలు బయలుదేరినట్లు చెప్పారు. సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు రెండు మొబైట్ ఆస్పత్రి టెంట్లు, 25 టన్నులకుపైగా సహాయక సామగ్రి పంపినట్లు తెలిపారు.