టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా
వాషింగ్టన్, అక్టోబర్ 17: జర్నలిస్టు రాణా అయ్యూబ్తో ఫొటో వివాదంపై ఓ నెటిజన్కు, మరో బీజేపీ నేతకు అమెరికన్ టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా దీటుగా జవాబిచ్చారు. ‘మోదీకి ఓటేశావా.. ఏంటి?’ అని నెటిజన్ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే.. మార్టినాతో కలిసి దిగిన ఫొటోను రాణా అయ్యూబ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ను చూసిన మార్టినా.. రాణాను కలవటం గొప్పతనంగా భావిస్తున్నానని రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్లను చూసిన ఓ నెటిజన్ మార్టినాకు మెసేజ్ చేస్తూ.. ‘మీరు గొప్పవారే కానీ, రాణా అయ్యూబ్ భారత్లో ఏం చేస్తున్నారో మీకు తెలిసి ఉండదు’ అని హవాలా కేసులను ప్రస్తావించాడు. దీన్ని చూసిన మార్టినా.. రాణా న్యాయం కోసం పోరాడుతున్నారని తెలిపారు. ‘నువ్వు మోదీకి ఓటేశావా? ఏంటి?’ అని మార్టినా ఆ నెటిజన్ను ప్రశ్నించారు.