దోహా : తమ ప్రాదేశిక జలాల్లో సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారని ఖతార్ రక్షణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని, కుట్ర కోణం ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. ప్రత్యేక సహాయక బృందాలు మృతదేహాల వెలికితీత పనిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
మృతుల్లో నలుగురు తమ దేశ సైనికులని, ఒకరు ఖతార్-తుర్కియే సంయుక్త దళంలో జవాన్ అని, ఇద్దరు టెక్నీషియన్లు అని వారు వెల్లడించారు. యుద్ధం జరుగుతున్న తరుణంలో ఈ ప్రమాదం సంభవించడం గమనార్హం. అయితే హెలికాప్టర్ సాధారణ విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నారు.