బ్లాంటైర్: మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం సోమవారం అదృశ్యమైంది. దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ విమానంలో ఆయనతోపాటు మరో 9 మంది ప్రయాణిస్తున్నారు. రాజధాని నగరం లిలోన్గ్వే నుంచి బయల్దేరిన ఈ విమానం మ్జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగవలసి ఉంది. కానీ రాడార్తో దీని సంబంధాలు తెగిపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు.