వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్కార్డు) కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు బైడెన్ ప్రభుత్వం చేదువార్త చెప్పింది. 2024 ఆర్థిక సంవత్సరం నుంచి ఈబీ-2, ఈబీ-3 (ఎంప్లాయ్మెంట్ బేస్డ్-2, 3) క్యాటగిరీల్లో భారతీయుల నుంచి గ్రీన్కార్డులకు దరఖాస్తులు స్వీకరించబోమని ప్రకటించింది. ఈ రెండు క్యాటగిరీల్లో గ్రీన్కార్డులకు నిరీక్షణ సమయం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 11 లక్షల మంది భారతీయులు గ్రీన్కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, వీరిలో ఈబీ-2, ఈబీ-3 క్యాటగిరీలకు చెందినవారే అత్యధికంగా ఉన్నారని తెలిపింది. అమెరికాలో గ్రీన్కార్డుల కోసం వేచిచూస్తున్న వారిలో భారతీయులే అత్యధికం.