ఇస్లామాబాద్, మార్చి 29: ప్రతిపక్ష పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం నాడు చర్చతో పాటు ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీచేశారు. తీర్మానంపై ఓటింగ్కు దూరంగా ఉండాలని, పార్లమెంట్కు హాజరు కావొద్దని ఆదేశించారు. తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపిక చేసిన సభ్యులు మాత్రమే పార్టీకి అనుకూలంగా మాట్లాడుతారని పేర్కొన్నారు. ఈ సూచనలు ఉల్లంఘించినా, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నడుచుకున్నా వేటు తప్పదని హెచ్చరించారు.