కారకాస్: నిమిషం తేడాతో సంభవించిన రెండు భూకంపాల వల్ల వెనిజువెలా(Venezuela Earthquake) అతలాకుతలమైంది. లా గువైరా రాష్ట్రంలో తీవ్ర నష్టం జరిగింది. అనేక బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాల కింద ఓ గర్భిణి.. మగపిల్లాడికి జన్మనిచ్చింది. బుధవారం సాయంత్రం వెనిజువెలాలో జంట భూకంపాలు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే శిథిలాల్లో చిక్కుకున్న ఓ మహిళ.. శిశువుకు జన్మనిచ్చింది. సుమారు రెండు రోజల పాటు శిథిలాల కింద ఉన్న ఆమెను బయటకు తీశారు. స్థానికులు ఆమెకు ఆ శిథిలాల్లోనే పురుడు పోశారు. శిథిలాల్లో చిక్కుకున్న ఆ మహిళ ఎంత ప్రసవ వేదన అనుభవించిందో..
A powerful moment from Venezuela 🇻🇪❤️
A woman reportedly gave birth beneath the earthquake rubble as rescuers searched for survivors.
Even in the darkest moments, life finds a way. pic.twitter.com/kUl9lfVXHA
— Geo Think Tank (@JohnKennedy869) June 26, 2026
తాజా సమాచారం ప్రకారం వెనిజువెలాలో భూకంపాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 235కు చేరుకున్నది. ఇక 4300 మంది గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.