బ్రిటన్ : ప్రిన్స్ చార్లెస్- ప్రిన్సెస్ డయానా వివాహం జరిగి నలభై ఏండ్లు గడిచిన తరువాత వారి వెడ్డింగ్ కేక్లోని ఓ ముక్కను డోమినిక్ వింటర్ అనే సంస్థ నిర్వాహకులు వేలానికి ఉంచారు. ఆగస్టు 11న దీనికి వేలం పాట జరుగనుంది. క్వీన్ మదర్ ఇంటి సభ్యురాలై మొయిరా స్మిత్ నుంచి వేలందారులు ఈ ముక్కను సేకరించారు. ‘ఆమె ఈ కేక్ ముక్కను పూల మొక్కలను పోలిన డిజైన్తో తయారు చేసిన ఓ డబ్బాలతో దాచింది. చేతితో మూతపై జాగ్రత్తగా పట్టుకోండి.. ఇది చార్లెస్ ప్రిన్స్- ప్రిన్సెస్ డయానా వెడ్డింగ్ కేక్ అంటూ రాసి 29/7/1981న సంతకం చేసింది’ అని డొమినిక్ వింటర్ వేలందారులు తెలిపారు.
జులై 29, 1981న చార్లెస్ ప్రిన్స్ – ప్రిన్సెస్ డయానా వివాహం సందర్భంగా వచ్చిన 23 అధికారిక వెడ్డింగ్ కేకుల్లో ఓ దాని ముక్కగా దీన్ని భావిస్తున్నారు. దీనిపై చెక్కరతోపాటు పలు పదార్థాలతో బంగారు, ఎరుపు, నీలం, వెండి రంగులతో బ్రిటన్ రాజచిహ్నం ముద్రించి ఉంది. స్మిత్ కుటుంబ సభ్యులు దీన్ని 2008లోనే విక్రయించారు. ఈ ఆగస్టు 11న మరోసారి దీనిని వేలం వేయనున్నారు. 300 పౌండ్ల నుంచి 500 పౌండ్ల వరకు ధర పలకనుందని అంచనా వేస్తున్నారు. చూడడానికి ఈ కేక్ ముక్క చాలా బాగుందని, కానీ దీన్ని తినడానికి విక్రయించడం లేదని డోమినిక్ వింటర్ వేలం సంస్థ పేర్కొంది.