లండన్: పక్షవాత బాధితుల్లో అవయవాల పనితీరును పునరుద్ధరించడానికి కొత్త రకమైన ‘బయోహైబ్రిడ్’ న్యూరల్ ఇంప్లాంట్ను బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయి. అవయవాలు, మెదడు మధ్య సంబంధాన్ని మెరుగుపర్చేలా ఈ పరికరం పని చేస్తుంది. నరాల పునరుజ్జీవానికి ఉన్న రెండు అధునాతన చికిత్సలైన సెల్ థెరఫీ, బయోఎలక్ట్రానిక్స్ను ఒకే పరికరంలో జోడించడం ద్వారా మెరుగ్గా పని చేయగలుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.