టోక్యో, అక్టోబర్ 3: ఎస్కలేటర్లపై నడవడాన్ని జపాన్లోని ఓ నగరం నిషేధం విధించింది. ఎస్కలేటర్లపై నిల్చోవాలని, నడవకూడదని పేర్కొం టూ నగోయ నగరం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆదేశాలు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
2018-19 మధ్యకాలంలో జపాన్లోని ఈ నగరంలో 805 ఎస్కలేటర్ల ప్రమాదాలు జరిగాయి. దీంతో కార్యాలయాలు, షాపింగ్మాళ్లు, రైల్వే స్టేషన్లు, భవంతుల్లోని ఎస్కలేటర్లను వినియోగించేటప్పుడు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.