అతడి వయసు 87 ఏళ్లు. గత 67 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు స్నానం చేయలేదు. ఆయనకు స్నానం చేస్తే బ్యాడ్ లక్ తగులుతుందట. అందుకే.. గత ఆరు దశాబ్దాల నుంచి స్నానం చేయడమే మానేశాడు. ఎక్కడ నీటి కుంటలు ఉంటే అక్కడే నీళ్లు తాగుతాడు. అయినా కూడా ఇప్పటి వరకు చిన్న అనారోగ్య సమస్య రాలేదు. 87 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంతకీ ఎవరాయన.. అంటారా? ఆయన పేరు అమౌ జాజి. అతడిది ఇరాన్. ఇక ఆయన తినే తిండి ఏంటో తెలుసా? మనలా అన్నం తినడు. రోడ్డు మీద కనిపించే పందికొక్కులు, ఎలుకలు, కుందేళ్లే ఆయన ఆహారం. అసలు.. ఆయన ఆరోగ్య రహస్యం ఏంటో తెలియక శాస్త్రవేత్తలే తలలు పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం జాజి డెజ్గా అనే గ్రామంలో ఉంటున్నాడు. అతడి విచిత్ర వేషధారణ చూసి అక్కడి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అతడి కోసం ఒక చిన్న ఇల్లును కట్టించి ఇచ్చారు. దీంతో అందులోనే అతడి జీవనం. డాక్టర్లు చాలాసార్లు అతడి దగ్గరికి వచ్చి అతడిని టెస్ట్ చేశారట. కానీ.. అతడికి చిన్న ఆరోగ్య సమస్య కూడా లేదట.
అతడి విచిత్రమైన అలవాట్లను చూసి డాక్టర్లు షాక్ అయ్యారట. పశువుల పేడతో తయారు చేసిన సిగిరెట్లను తాగడం జాజికి బాగా అలవాటు. ఇప్పటికీ జాజిని చూడటానికి చాలామంది ఆ గ్రామానికి వెళ్తుంటారట. ఏంటో ఈ ప్రపంచంలో ఇలాంటి విచిత్రమైన మనుషులు కూడా ఉంటారన్నమాట.