లాస్ ఏంజిల్స్: మ్యూజిక్ ఫెస్టివల్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అమెరికాలో ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతిచెందారు. టెక్సాస్లోని హూస్టన్లో ఈ ఘటన జరిగింది. స్టేజ్పైకి ట్రావిస్ స్కాట్ రాగానే.. ఒక్కసారిగా జనం వేదిక వైపు ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. గుండెపోటుతో 11 మంది హాస్పిటల్కు తరలించారు. మరో 8 మంది మృతిచెందారు. సుమారు 300 మంది గాయపడ్డారు. దాదాపు 50 వేల మంది ఆ మ్యూజిక్ ఈవెంట్కు హాజరైనట్లు పోలీసులు తెలిపారు.