పారిస్: ఫ్రాన్స్లో ఎయిర్బస్ అట్లాంటిక్ సంస్థకు చెందిన సిబ్బందికి ఇచ్చిన క్రిస్మస్ డిన్నర్(Christmas Dinner) వికటించింది. ఆ కంపెనీకి చెందిన సుమారు 700 మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఫ్రాన్స్కు చెందిన ఆరోగ్యశాఖ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. డిన్నర్ తిన్న ఉద్యోగులు.. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్లు ఏఆర్ఎస్ హెల్త్ ఏజెన్సీ పేర్కొన్నది. అయితే డిన్నర్కు ఇచ్చిన మెనూలో ఏమి డిషెస్ ఉన్నాయో స్పష్టంగా తెలియదు. ఎయిర్బస్ సంస్థ కూడా ఈ ఘటనపై స్పందించలేదు. ఎయిర్బస్ సంస్థకు చెందిన అనుబంధ సంస్థే ఎయిర్బస్ అట్లాంటిక్. ఆ సంస్థ కింద 5 దేశాల్లో సుమారు 15వేల మంది పనిచేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్కు సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు సంస్థ తెలిపింది. ఎయిర్బస్ సంస్థలో సుమారు లక్షా 34 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్, డిఫెన్స్, స్పేస్, సెక్యూర్టీ పరిశ్రమలు ఆ కంపెనీ పరిధిలో ఉన్నాయి.