మాస్కో, జనవరి 8: ఉక్రెయిన్పై రష్యా ప్రతీకారం తీర్చుకొన్నది. మొన్నకిమొన్న రష్యా బలగాలపై ఉక్రెయిన్ సైన్యం దాడిచేయగా చాలా మంది మరణించారు. దాంతో తాజాగా, ఈశాన్య ఉక్రెయిన్లోని రెండు తాత్కాలిక షెల్టర్లలో తలదాచుకొన్న ఉక్రెయిన్ సైనికులపై రాకెట్ దాడులు చేసి 600 మందిని హతమార్చింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. అయితే, సైనికుల మరణాల సంఖ్యపై ఉక్రెయిన్ ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.