వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియా రాష్ట్రం చీసాపీక్లోని వాల్మార్ట్ స్టోర్లో మంగళవారం రాత్రి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు.
నిందితుడిని స్టోర్ మేనేజర్గా భావిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. రాత్రి 10.12 గంటలకు స్టోర్ మేనేజర్ బ్రేక్ రూమ్లోకి చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు వచ్చేలోగా అతడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఘటనపై వాల్మార్ట్ సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది.